పాకిస్థాన్ రాజధాని కరాచీలో దారుణం చోటుచేసుకుంది. ఆగస్టు 19న కర్సాజ్ రోడ్డులో ఓ మహిళ తన కారుతో వెళ్తూ పలు వాహనాలను ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, సదరు యువతి నవ్వుతూ వీడియోలకు ఫోజులిచ్చింది. పైగా మా నాన్న ఎవరో తెలుసా? అంటూ బెదిరింపులకు దిగింది. మహిళను నటాషా దానిష్ అలీగా పోలీసులు గుర్తించారు. ఆమె పాక్లోని ప్రఖ్యాత వ్యాపారవేత్త దానిష్ ఇక్బాల్ భార్య.