ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి

538பார்த்தது
ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి
18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోదీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. శుక్రవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పార్టీలన్నీ ప్రధానిగా మోదీకి సమ్మతి తెలిపాయి. దీంతో శుక్రవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మోదీకి రాష్ట్రపతి ముర్ము ‘‘తీపి పెరుగు’’ తినిపించారు.

தொடர்புடைய செய்தி