కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య

52பார்த்தது
కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య
బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 25కి చేరింది. బిహార్‌లోని సివాన్‌, సారణ్ జిల్లాల్లో ఇటీవల కల్తీ మద్యం తాగి పలువురు అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. ఒక్క సివాన్‌ జిల్లాలోనే 20 మంది ప్రాణాలు కోల్పోయారని సివాన్‌ ఎస్పీ అమితేష్‌ కుమార్‌ తెలిపారు. మరో 10-15 మందికి పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సారణ్ జిల్లాలో ఐదుగురు మృతి చెందారని చాప్రా పట్టణం ఎస్పీ కుమార్‌ ఆషిశ్‌ తెలిపారు.

தொடர்புடைய செய்தி