దొంగతనం చేశారనే అనుమానంతో.. గుండు గీయించి ఊరేగించారు

76பார்த்தது
దొంగతనం చేశారనే అనుమానంతో.. గుండు గీయించి ఊరేగించారు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లా తాజ్‌పూర్ తేడియా గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి 5 కేజీల గోధుమలను దొంగిలించి అమ్ముకున్నారనే అనుమానంతో ముగ్గురు దళిత బాలురిని గుండు గీయించి, మొహానికి మసిపూసి ఊరంతా ఊరేగించారు. ఊరిలో రెండు పౌల్ట్రీ ఫామ్‌లు నడుపుకునే నాజిం, ఖాసిం, సాను, ఇనాయత్ కలిసి ఈ పాశవిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி