తీన్మార్ మల్లన్న అంటేనే ఊసరవెల్లి : అశోక్ కుమార్

537பார்த்தது
తీన్మార్ మల్లన్న అంటేనే ఊసరవెల్లి : అశోక్ కుమార్
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రాజకీయ రంగు పులుముకుంటున్నది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అశోక్ కుమార్ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. జిఓ 46 విషయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ జీవోను రద్దు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని అశోక్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సవాల్ విసిరారు. గతంలో మేడ్చల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో మేడ్చల్ ప్రజల ఓట్ల కోసం తీన్మార్ మల్లన్న జీవో నెంబర్ 46ను సపోర్ట్ చేశారని ఆరోపించారు. కానీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ఊసరవెల్లిని మరిపిస్తున్నాడని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం కోసం మల్లన్న తెగ ప్రయత్నం చేశాడని, వంద కోట్లు ఖర్చు పెట్టుకుంటా. టికెట్ ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించినట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారని అశోక్ ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி