వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, న్యాయవాది నిజాం పాషా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి అత్యున్నత ధర్మాసనం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.