సీఎం కప్ టార్చ్ రాలీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

83பார்த்தது
సీఎం కప్ టార్చ్ రాలీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే
యువతకు క్రీడలపై ఆసక్తి, నైపుణ్యం పెంచేలా  రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. యువతను ప్రేరేపించి, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సీఎం రేవంత్ రెడ్డి టార్చ్ రిలే రాలీని రాష్ట్రవ్యాప్తంగా ఈ  నెల 03వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభించారు. జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకోగా, సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీతో కలిసి జెండా ఊపి సీఎం కప్ టార్చ్ రాలీని ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி