ఆర్టీసీ బస్టాండ్ లో ఫాన్స్ అందుబాటులోకి తేవాలి: ప్రయాణికులు

79பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లోని ఫాన్స్ తిరగడం లేదు. కావాలనే ఉద్దేశంతో బంద్ చేశారా.!? లేక అసలు పని చేయడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెంటనే ఆర్టీసీ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.