శంకరపట్నం: రుణమాఫీ కాలేదని రైతుల నిరసన

72பார்த்தது
శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. మొలంగూర్ ఇండియన్ బ్యాంకు పరిధిలోని పలు గ్రామాల 800 రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, బ్యాంకుమేనేజర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. పోలీసులు మండల వ్యవసాయాధికారి జోక్యంతో రైతులు ధర్నా విరమించారు.

தொடர்புடைய செய்தி