బాలుడిని బలి తీసుకున్న ట్రాక్టర్

65பார்த்தது
బాలుడిని బలి తీసుకున్న ట్రాక్టర్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం మాదాపూర్ కాలనీలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్ కాలనీకి చెందిన కారంగుల మహర్షి (5) బాలుడు ట్రాక్టర్ కింద పడ్డాడు. స్థానికులు వెంటనే బాలుడుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி