అండర్ 17 రాష్ట్ర స్థాయి క్రీడాకారులను సన్మానించిన ప్రభుత్వ విప్

85பார்த்தது
అండర్ 17 రాష్ట్ర స్థాయి క్రీడాకారులను సన్మానించిన ప్రభుత్వ విప్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్ 17 వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఎండపల్లి మండలానికి చెందిన క్రీడాకారులు గీతిక, ప్రానికతన్ వారి కొచ్ తో కలిసి ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడకారులను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. అనంతరం వారికి ప్రోత్సాహకంగా రూ.5 వేల నగదును అందజేసి భవిష్యత్తులో వారికి అన్నీ విధాలా అండగా ఉంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி