నాగారం, శివానగర్, సోలక్పల్లి గ్రామస్తుల ధర్నా

82பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ కేంద్రంలో నాగారం, శివానగర్, సోలక్పల్లి గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. నర్సాపూర్ నుంచి పటాన్ చెరుకు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో స్థానిక బస్టాండ్ ముందు చేపట్టిన ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி