మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగుతున్నది. వరద ఉధృతికి ఆలయంలోకి నీరు చేరింది. గత ఆరు రోజులుగా ఆలయం నీట మునిగే ఉన్నది. ఈనేపథ్యంలో శుక్రవారం రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.