భారీ వర్షాల వేళ సూర్యాపేట జిల్లా కోదాడలో వరద నీటిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. కారులో ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని రవి అనే వ్యక్తిగా నిర్ధారించారు. శ్రీమన్నారాయణ కాలనీలోని వాగులో మరో మృతదేహం దొరికింది. మృతుడిని శ్రీనివాసనగర్కు చెందిన వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడుగా గుర్తించారు. శనివారం రాత్రి ఆయన బైక్పై ఇంటికి వెళ్తూ గల్లంతయ్యారు.