జీఎస్టీ చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొన్న చందా సాయికుమార్ కంపెనీలను మూసివేయమని తనకు ఇచ్చిన పాన్ నంబర్లు, ఆధార్ కార్డులను ఉపయోగించి ఫోన్ నంబర్లు మార్చి వాటిని మూసివేయకుండా కొనసాగించాడు. క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే పేపర్పైనే లావాదేవీలు నిర్వహించినట్లు చూపించి తప్పుడు పత్రాలు జీఎస్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అత్యధిక జీఎస్టీ స్లాబ్ ఉన్న సిమెంట్, ఐరన్లను వ్యాపారం చేసినట్లు కాగితాల్లో చూపించాడు.