సర్కార్ సంచలన నిర్ణయం.. గంజాయి సాగు ఇక చట్టబద్ధమే

69பார்த்தது
సర్కార్ సంచలన నిర్ణయం.. గంజాయి సాగు ఇక చట్టబద్ధమే
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం సంచలన తీర్మానం చేసింది. రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమల్లో భాగంగా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే నిర్ణయాన్ని తీసుకున్నామని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఔషధ, పారిశ్రామిక అవసరాలను తీర్చే సదుద్దేశంతోనే గంజాయి సాగుకు చట్టబద్దత కల్పించామని తెలిపింది.

தொடர்புடைய செய்தி