సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ఫ్లాట్ లైట్లుతోపాటు బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు రెండు క్రేన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.