32 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట

63பார்த்தது
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కింద ఉన్న వరి పంట శనివారం నీట మునిగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. చెరువు కింద 32 ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వ స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி