వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని గణేష్ గడ్డ గణపతి దేవాలయంలో ఆదివారం కుంకుమ రంగులో గణపతిని అలంకరించారు. అంతకుముందు గణపతికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు జరిపించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చారు.