23 నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడలు

65பார்த்தது
23 నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడలు
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు 23 నుంచి 28వ తేదీ వరకు పటాన్ చెరు మైత్రి మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 23న బాలురకు, 24న బాలికలకు కబడ్డీ, 25న బాలురు, 26న బాలికలకు వాలీబాల్, 27న బాలికలు, 28న బాలురకు ఖోఖో పోటీలు జరుగుతాయని చెప్పారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు హాజరుకావాలని కోరారు.

தொடர்புடைய செய்தி