బీఆర్ ఎస్ పార్టీ హయాంలో తీసుకువచ్చిన పలు పథకాలకు తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.ముఖ్యంగా రైతు బంధు, దళిత బంధు పథకాలను వదిలేసింది. వీటి స్థానంలో ఒక్క రైతు భరోసా ను తీసుకువచ్చినా.. దీనికి గాను ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఇక, ఎన్నికలకు ముందు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం.. ప్రకటించిన పథకాలకు మాత్రమే తాజాగా ప్రకటించిన ఏడు మాసాల బడ్జెట్లో నిధులు కేటాయించింది.