రైల్వే ట్రాక్‌పై రీల్స్.. రైలు ఢీకొని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

65பார்த்தது
రైల్వే ట్రాక్‌పై రీల్స్.. రైలు ఢీకొని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. సీతాపూర్‌కు చెందిన అహ్మద్ (30), అతని భార్య నజ్మీన్ (24), మూడేళ్ల చిన్నారి అర్కంతో కలిసి కేవంతికలా హర్‌గావ్‌‌లో జాతర చూసేందుకు బుధవారం వచ్చారు. సమీపంలోని ఉమారియా రైల్వే వంతెన వద్దకు వెళ్లి ఇన్‌స్టా రీల్స్ తీశారు. వీడియోలు తీసుకోవడంలో వారు నిమగ్నమై ఉండగా ఓ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. ముగ్గురూ సంఘనా స్థలంలోనే చనిపోయారు.

தொடர்புடைய செய்தி