షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో గత కొంతకాలంగా కోనంగుల చేష్టలతో గ్రామస్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ కోనంగులు దాడులకు తెగబడుతున్నాయి. గత కొంత కాలంనుంచి మదురాపురం స్థానికులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. సోమవారం ఉదయం గ్రామంలో చిత్త ట్రాక్టర్ ప్రజల వద్ద చెత్త సేకరిస్తుండగా ప్రభావతమ్మ అనే మహిళ చెత్త వేయడానికి వెళ్ళింది అప్పుడే వెనక నుండి కోనెంగ వచ్చి దాడికి పాల్పడింది.