ఈ 9 మండలాల్లో మహిళా ఓటర్లే అధికం

69பார்த்தது
ఈ 9 మండలాల్లో మహిళా ఓటర్లే అధికం
రంగారెడ్డి జిల్లాలో అధికారులు ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. చాలా చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, ఫరూఖ్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కేశంపేట, కొందుర్గు, నందిగామ, శంషాబాద్‌, శంకర్‌పల్లి, యాచారం మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను వారే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி