స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం చేపట్టిందని తహసీల్దార్ షేక్ ముంతాజ్ బేగం అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ముద్వీన్ గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం స్థానికులతో కలిసి మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.