విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి

76பார்த்தது
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి
తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధి ఉమరాఖాన్ గూడ, సంఘీనగర్ లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కరాడి శ్రీలత కోరారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం డివిజనల్ ఇంజినీర్ పి. యాదగిరికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, స్తంభాల షిఫ్టింగ్, కొత్త పోల్స్ ఏర్పాటు, వేలాడుతున్న తీగలను సరిచేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி