రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు(వీడియో)

72பார்த்தது
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. 4 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఆయన ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌తో కలిసి ఆయన ఢిల్లీకి వచ్చారు. సోమవారం ముయిజ్జు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం భార్య సాజిదాతో కలిసి రాజ్‌ఘాట్‌లో ముయిజ్జు నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி