నూతన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సీఈసీ ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఫిబ్రవరి 19న సుప్రీం కోర్టు విచారించనున్నందున దీన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ కోరారు. సీఈసీ సెలక్షన్ కమిటీ మార్గదర్శకాల్లో కొన్ని సవరణలతో ప్రభుత్వం నియంత్రణ కోరుకుంటున్న విషయం అర్థమవుతోందని ఆయన అన్నారు.