ప్రాణం పోతున్నా.. పట్టించుకోని జనం!

63பார்த்தது
ప్రాణం పోతున్నా.. పట్టించుకోని జనం!
ఓ యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొడుకును కాపాడుకునేందుకు అతడి తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్దాం.. కాస్త సాయం చేయండని దారిన పోయే ప్రతి ఒక్కరినీ వేడుకున్నారు. కానీ ఎవరూ సాయం చేయలేదు. అంబులెన్స్ వచ్చేసరికి ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన కె.గంగాధర్ రావు (30) తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళ్తున్నాడు. గూడ్స్ షెడ్డు వంతెన దగ్గర పని ఉందని ఆటో దిగి ఒక్క అడుగు ముందుకు వేసేసరికి ట్రాక్టర్ ఢీకొట్టింది.

தொடர்புடைய செய்தி