నాలుగు రోజులుగా నడవని కుమ్మరికుంట-ధర్మారం ఆర్టీసీ బస్సు

62பார்த்தது
నాలుగు రోజులుగా నడవని కుమ్మరికుంట-ధర్మారం ఆర్టీసీ బస్సు
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ధర్మారం మండల కేంద్రానికి వయా కుమ్మరికుంట ఆర్టీసీ బస్సు గత నాలుగు రోజులుగా నడవడం లేదు. ఆర్టీసీ బస్సు రాకపోవడంతో కటికనపల్లి, చామనపల్లి, కొత్తూర్, కుమ్మరికుంట, వెంకట్రావు పల్లి, నిట్టూర్, నిమ్మనపల్లి గ్రామాల ప్రయాణికులు పండుగ పూట ఇబ్బంది పడుతున్నారు. గోదావరిఖని డిపో అధికారి స్పందించి ఆర్టీసీ బస్సును కేవలం మోడల్ స్కూల్ పనిదినల్లో కాకుండా ప్రతి రోజు అన్ని ట్రిప్పులు యధావిధిగా నడపాలని ఆయా గ్రామాల ప్రయాణికులు మంగళవారం ఒక ప్రకటనలో కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி