మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుర్హాన్పూర్ జిల్లా ఇండోర్-ఇచాపూర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ప్రయాణీకుల బస్సు అదుపతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.