బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలపై పార్లమెంట్‌ కమిటీ అసంతృప్తి

56பார்த்தது
బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలపై పార్లమెంట్‌ కమిటీ అసంతృప్తి
ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ సేవల్లో నాణ్యత లోపించడంపై పార్లమెంట్‌ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు, పనితీరుపై సోమవారం బీజేపీ ఎంపీ సంజయ్‌ జైశ్వాల్‌ నేతృత్వంలో కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవల నాణ్యతపై మాట్లాడారు. ఎంపీల ఫిర్యాదులపై స్పందించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ, టెలికం కార్యదర్శి.. ఆరు నెలల్లో మెరుగైన ఫలితాలు చూపుతామని తెలిపారు.

தொடர்புடைய செய்தி