బోల్తా పడిన వ్యాన్.. 12 మందికి తీవ్ర గాయాలు (వీడియో)

84பார்த்தது
తమిళనాడులోని కాంచీపురం సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాంసంగ్ ఫ్యాక్టరీ కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 12మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను శ్రీపెరుంపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி