మధుమేహం ఇంటింటి సమస్యగా మారింది. ఇందులో కణాలు ఇన్సులిన్కు సరిగా స్పందించవు. దీంతో గ్లూకోజు కణాల్లోకి అంతగా వెళ్లదు. అప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇది క్రమంగా గుండెజబ్బు, చూపు పోవటం, నాడులు దెబ్బతినటం, కిడ్నీలు, చర్మం పాడవ్వడం వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. ఇటీవల మధుమేహం మీద అవగాహన పెరిగినా చాలామందిలో తీవ్రమయ్యేవరకూ బయటపడటం లేదు. ప్రతి ముగ్గురిలో ఒకరికి సమస్య ఉన్నట్టయినా తెలియటం లేదు.