స‌ర్పంచ్ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ అప్పుడేనా?

75பார்த்தது
స‌ర్పంచ్ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ అప్పుడేనా?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎప్పుడు జరుగుతాయనే చర్చకు తెర దింపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో చెప్పినట్టుగా కులగణన, ఎస్సీ వర్గీకరణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. ఇందుకోసం ఏకసభ్య న్యాయ కమిషన్‌ పేరుతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ లెక్క‌ను చూస్తుంటే జ‌న‌వ‌రి చివరిలోపు స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி