ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పరిధిలోని గండిమాసానిపేట్, కొత్తపల్లిలో వీధిలైట్ల సరిగ్గా వెలగడం లేదని, నూతన లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ యువకులు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజుకు వినతిపత్రం అందజేశారు. యువకులు కమిషనర్తో మాట్లాడుతూ. కొత్తపల్లి గేటు వద్ద ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయాలని, గండిమాసానిపేట్ గేట్ వద్ద ఉన్న ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని చెప్పారు.