నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ

62பார்த்தது
వినాయక నిమజ్జన శోభాయాత్రను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షణ చేశారు. శోభాయాత్ర కొనసాగుతున్న తీరును, ఆయా ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులను వీక్షించారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీసులు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న తీరును నిశితంగా పర్యవేక్షణ జరిపారు.

தொடர்புடைய செய்தி