స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం

260பார்த்தது
స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం
నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక సరస్వతి విశ్వబ్రాహ్మణ భవనములో భారత 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు తంగళ్ళపల్లి శ్రీనివాసచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా సంఘానికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ చేతి వ్రృత్తులపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు పనులు ఉపాధి పరంగా మంచి రోజులు రావాలని , ఈ ప్రభుత్వాలు చేతివ్రృత్తుల వారిని ఆదుకుని తగిన సంక్షేమ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సరాపు లక్ష్మీ నర్సయ్యచారి , కార్యనిర్వాహక కార్యదర్శి బందనకంటి నరసింహాచారి, రాష్ట్ర సంఘ పెద్దలు మోతె వెంకటేశంచారి, ఉపాధ్యక్షుడు మెగాజీ ప్రసాద్ చారి, కార్యదర్శి కటకం గోవిందాచారి, చిలుముల గిరిధర్ చారి, సేవర్తి శ్రీనివాస్ చారి, అనిల్ చారి, శ్రీనివాసచారి మరియు జిల్లా సభ్యులు అందరు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி