బ్లడ్ క్యాన్సర్ వ్యాధి పట్ల ఉన్న అపోహలపై ఆందోళన చెందవద్దని హైదరాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ వైద్యులు గణేష్ జై షేత్వాల్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే బ్లడ్ క్యాన్సర్ ను నయం చేయవచ్చని వెల్లడించారు.