పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

1077பார்த்தது
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాల(మాణిక్ భవన్) పాఠశాలలో ఆదివారం నాడు 1994-95 పదవ తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ స్నేహ సమ్మేళనం నిర్వహించడం నిర్వహించడం జరిగింది. మిత్రులందరు తమ కుటుంబ సభ్యులతో హాజరై చదువుకున్న బాల్యం రోజులను గుర్తు చేసుకుని, కార్యక్రమానికి వచ్చిన పూర్వ ఉపాధ్యాయులు ప్రస్తుత ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్య కార్గవర్గ సభ్యులను సన్మానించి, వారి ఆశీస్సులను పొందడం జరిగింది. దూరప్రాంతాల నుండి కూడా ఎంతో ఉత్సాహంతో తరలివచ్చిన స్నేహితులందరితో ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు మురళీక్రృష్ణ, కాంతయ్య, ఇవర్ గలయ్య, సురేందర్, సాయిలు, విఠల్‌, బుచ్చయ్య, మరియు ప్రస్తుత ఉపాధ్యాయులు స్వరూపారాణి, శ్యామలా, రమేష్, శ్రీనివాస్, కళాశాల వ్యవస్థాపకులు పెద్దలు చిటిమిల్ల హరిప్రసాద్, పాఠశాల పాలకవర్గ పెద్దలు ధన్ పాల్ శ్రీనివాస్, ఇంగు శివప్రసాద్, కొండా సత్యప్రసాద్, బెజుగం సతీష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி