ఘన్ పూర్ లో చిన్నారులు చేసిన మట్టి గణనాథుడు

68பார்த்தது
ఘన్ పూర్ లో చిన్నారులు చేసిన మట్టి గణనాథుడు
చండూరు మండలం ఘనపూర్ గ్రామంలో గంగ పుత్ర సంఘానికి చెందిన కొందరు చిన్నారులు మట్టి గణపతిని తయారు చేశారు. తమ చెరువులో ప్రతిసారి రసాయనాలతో చేసినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేయడంతో చేపల మనుగడ ఇబ్బందిగా ఉందని గ్రహించిన చిన్నారులు నెల కిందట మట్టిని తెచ్చి ప్రారంభించిన గణనాథుడు గురువారం పూర్తి రంగులతో ప్రతిష్టకు సిద్ధమైంది. చిన్నారులు ఈ ఆలోచన చేసి మట్టి గణపతిని చేసినందుకు గ్రామస్తులు వారిని అభినందించారు.

தொடர்புடைய செய்தி