కేంద్ర ఆర్థిక మంత్రిగా రెండోసారి నిర్మలా సీతారామన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నార్త్ బ్లాక్ కార్యాలయానికి చేరుకున్న సీతారామన్ను ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరం కోసం తుది బడ్జెట్ను ఆమె త్వరలో సమర్పించనున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా హాజరయ్యారు. చౌదరి మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.