వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

71பார்த்தது
కుబీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో ప్రతిష్టించిన వినాయకుడిని మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో సన్మానించి స్వామివారి మెమోంటో తీర్థప్రసాదాల అందజేశారు. ఈ సందర్భంగా నేడు జరగబోయే గణేష్ నిమజ్జన శోభయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. మండల బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி