లోకేశ్వరం: రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కేసులు: ఎస్ఐ

78பார்த்தது
లోకేశ్వరం: రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కేసులు: ఎస్ఐ
రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని లోకేశ్వరం ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని పలుగ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి కిందపడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ధాన్యం అరబోయడానికి కల్లాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி