కర్ర వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

62பார்த்தது
కర్ర వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామాలోని కర్ర వరసిద్ధి వినాయకుడిని ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కర్ర వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி