నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థుల నిరసన ర్యాలీ

68பார்த்தது
జన్నారం మండల కేంద్రంలో కోల్కత్తా ట్రైని డాక్టర్ పై అత్యాచారం, హత్య సంఘటన కు నిరసన తెలుపుతూ శుక్రవారం విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కరిమెల జూనియర్ కళాశాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని ప్రిన్సిపల్ లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி