అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిర్మల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలువురు మారుమూల ప్రాంతాల ప్రజలు టెలిఫోన్ ప్రజావాణికి కాల్ చేసి తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు.