రామాలయంలో తొలి ఏకాదశి పూజలు

72பார்த்தது
రామాలయంలో తొలి ఏకాదశి పూజలు
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ లో ఉన్న రామాలయంలో వీడిసి సభ్యులు తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం ఆ దేవాలయంలోని సీతారామ స్వామి వారి మూల విగ్రహాలను పలు రకాల పూలతో వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ విడిసి సభ్యులు, ప్రజలు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி