మున్సిపల్ కార్మికులపై తేనెటీగల దాడి

74பார்த்தது
ఖానాపూర్ పట్టణంలోని ఉద్యానవన పార్కులో తేనెటీగలు దాడి చేసిన సంఘటనలో ఐదుగురు మున్సిపల్ కార్మికులకు గాయాలయ్యాయి. సోమవారం ఖానాపూర్ మున్సిపల్ కార్మికులు ఉద్యాన పార్కులో ట్రాక్టర్ నుండి చెట్లను తీస్తుండగా తేనెటీగలు వారిపై ఒక్కసారిగా దాడి చేశాయని తెలిపారు. ఈ సంఘటనలో ఐదుగురు మున్సిపల్ కార్మికులకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி