నల్లగొండ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నర్సింహా తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ ఎన్నికల ఇన్చార్జి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. ఎమ్మెర్వో కార్యాలయం నుండి కనకదుర్గమ్మ దేవాలయం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు.